హైదరాబాద్ : కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రమని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్లో మంత్రి హరీష్రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, ప్రజలు పోరాడి తెచ్చుకున్నారన్నారు. రాహుల్ ఏపీకి ప్రత్యేక హోదా అంటున్నాడని, తెలంగాణ హక్కుల గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. మీ ప్రేమను చూస్తుంటే ఈ జన్మకు ఇది చాలనిపిస్తోందన్నారు. ఇబ్రహీంపూర్ వాసులు మంత్రి హరీష్రావు గెలుపుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm