నల్లగొండ: జిల్లాలోని కొండమల్లెపల్లి మండలం పరిధిలోని కొత్తబావి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడటంతో జరిగిన ప్రమాదలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వ్యక్తి శవాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm