విజయవాడ: బీజేపీ సమావేశంలో చేసిన తీర్మానాలన్నీ లోపభూయిష్టమే అని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాఫెల్ కుంభకోణంతో దేశ భద్రతనే అమ్ముకున్న బీజేపీ అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు రాకుండా చేసింది బీజేపీనే అని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ఏపీ గురించి మాట్లాడే అర్హత బీజేపీకి, మోదీకి లేదని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm