హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ తెలిపారు. 23న ఉదయం 6 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. గణపతి నిమజ్జనం కోసం భద్రత పటిష్టం చేస్తున్నాం. ఇద్దరు డీసీపీలు, నలుగురు అడిషనల్ డీసీపీలు, 2100 ట్రాఫిక్ ఆఫిసర్లు బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm