హైదరాబాద్: కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న దామోదర రాజనర్సింహ సతీమణీ పద్మినీరెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే పద్మినీరెడ్డి బీజేపీలో చేరికపై రాజనర్సింహ స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పద్మినీరెడ్డి బీజేపీలో చేరికపై రాజనర్సింహను మీడియా ప్రశ్నించింది. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీకేం పని లేదా అంటూ మీడియాపై ఆయన కస్సుబుస్సులాడారు. అది తమ కుటుంబ వ్యవహారమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మినీరెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో పద్మినీరెడ్డి చేరికతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తరుపున ఆమె సంగారెడ్డి టికెట్ ఆశించినట్లు సమాచారం. సంగారెడ్డి టికెట్ జగ్గారెడ్డికి కాంగ్రెస్ కేటాయించడంతో ఆమె మనస్థాపానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పద్మినీరెడ్డి బీజేపీలో చేరినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. పద్మిని భర్త దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా దామోదర రాజనర్సింహ పనిచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm