న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఇక నుంచి థియరీ, ప్రాక్టికల్ కలిపి కనీసం 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 2019 ఫిబ్రవరిలో నిర్వహించే పరీక్షల నుంచి ఈ నిబంధన అమలులోకి రానుందని సీబీఎస్ఈ ఒక ప్రకటనలో గురువారం తెలిపింది. 'ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్స్, బోర్డు పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ 33 శాతం సాధించాలి. అప్పుడే వారు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటిస్తాం' అని పేర్కొంది. ఇప్పటివరకూ థియరీ, ప్రాక్టికల్లో విడివిడిగా 33 శాతం సాధించాల్సి ఉండగా.. ఇప్పుడు దీనిని సీబీఎ్సఈ సరళీకరించింది.
Mon Jan 19, 2015 06:51 pm