న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. తితలీ తుపాన్ ప్రభావంపై ఆరా తీశారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మోడీ. కాగా సీఎం చంద్రబాబుఅమరావతి నుంచి శ్రీకాకుళం వెళ్లారు. తొలుత విశాఖకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డుమార్గాన శ్రీకాకుళానికి చేరుకున్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా వాసులను పరామర్శించనున్నారు. సహాయ, పునరావాస చర్యలను పర్యవేక్షించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారాయణ, పితాని సత్యనారాయణ శ్రీకాకుళం చేరుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm