హైదరాబాద్: యువ ఆటగాడు పృథ్వీషాను ఎవరితోనూ పోల్చొద్దని, దయచేసి అతడిని ఒంటరిగా వదిలేయాలని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కోరాడు. అతడు ఎదిగేందుకు తగినంత సమయం ఇవ్వాలని సూచించాడు. వెస్టిండీస్తో తొలి టెస్టులో అరంగేట్రం చేసిన షా 154 బంతుల్లో 134 పరుగులు సాధించాడు. తొలి మ్యాచ్లో శతకం చేసిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. తన సొగసైన షాట్లు, అద్భుతమైన టెక్నిక్తో అలరించాడు. దీంతో అతడిని వీరేంద్ర సెహ్వాగ్తో పోల్చడం ఎక్కువైంది.
Mon Jan 19, 2015 06:51 pm