హైదరాబాద్: హెచ్ఎండీఏ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ)గా అదనపు బాధ్యతల ను డి.విజిత గురువారం బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎండీఏ డీఏఓగా పని చేస్తున్న విజితకు హెచ్ఎండీఏ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా విజిత మాట్లాడుతూ హెచ్ఎండీఏ పౌరసేవల్లో భాగంగా ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యమని, ప్రజలకు సమాచారం చేరవేసేందుకు తన వంతు బాధ్యతలను నిర్వర్తిస్తానని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm