హైదరాబాద్ : ఓపెన్ పదోతరగతి , ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు చేసినట్లు విద్యాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీవరకు అపరాధ రుసుముతో పదోతరగతి, ఇంటర్లో ప్రవేశాలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. పదోతరగతిలో ఓసీ పురుషులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పురుషులకు , మహిళలకు రూ.800 , అభ్యర్థులందరూ ప్రాస్పెక్టస్ ఫీజు రూ.200 , అపరాధ రుసుం రూ.200 చెల్లించాలని తెలిపారు. మండలంలోని అధ్యాయన కేంద్రంలో అన్ని ధ్రువపత్రాలు సమర్పించి అడ్మిషన్ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈవిషయాన్ని జిల్లాలోని అన్ని అధ్యాయన కేంద్రాల కో-ఆర్డినేటర్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ళ్లు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు గమనించి విస్తృత ప్రచారం చేయాలన్నారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని ఒక ప్రకటనలో కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm