న్యూఢిల్లీ: ఇంధనం ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఢిల్లీలో శుక్రవారం లీటర్ పెట్రోల్ 12 పైసలు పెరిగి రూ.82.48కి చేరింది. డీజిల్ 28 పైసలు పెరిగి రూ.74.90కి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.87.94 (12 పైసలు పెరుగుదల)కి చేరింది. డీజిల్ రూ.78.51 (29 పైసలు పెరుగుదల)కి పెరిగింది. గత వారం పెట్రోల్, డీజిల్పై రూ.2.50 పైసలు చొప్పున కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇంతే మొత్తానికి (రూ.2.50 చొప్పున) వ్యాట్ తగ్గించాలని కేంద్ర మంత్రి జైట్లీ విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ పాలిత 13 రాష్ట్రాలతో పాటు గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ వెంటనే తగ్గింపును ప్రకటించాయి. కాగా, కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ క్రమం తప్పకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో తమ ఇబ్బందులు షరామామూలుగానే ఉన్నాయని వినియోగదారాలు అంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm