హైదరాబాద్ : భాగ్యనగరంలో ఐదు రోజుల క్రికెట్ పండుగకి ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. అక్టోబర్ 12 నుండి 16 వరకు జరగనున్న ఐదు రోజుల టెస్ట్ సిరీస్లో తొలి రోజు ఇండియా టీం కరీబియన్లతో పోటికి సిద్ధమైంది. టాస్ గెలిచిన వెస్టీండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న టీం ఇండియా హైదరాబాద్లోను విజయ దుందుభి మోగించి వన్డే సిరీస్ని సరికొత్త ఉత్సాహంతో ప్రారంభించాలని అనుకుంటుంది. ఇండియా టీంలో షమీ స్థానంలో శార్ధూల్ని ఎంపిక చేయగా, ఇది ఇతనికి తొలి టెస్ట్. ఇక వెస్టీండీస్ విషయానికి వస్తే రెండు మార్పులతో టీం బరిలోకి దిగుతుంది. తొలి టెస్ట్ కి దూరమైన కెప్టెన్ హోల్డర్ మళ్లీ టీం లోకి వచ్చాడు.
Mon Jan 19, 2015 06:51 pm