విశాఖపట్నం: ఏవోబీ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందినట్లు రూరల్ ఎస్పీ రాహుల్ దేశ్శర్మ తెలిపారు. ఏవీబీలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో అండ్రపల్లి దగ్గర పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులు- మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు రూరల్ ఎస్పీ తెలిపారు. మృతిచెందిన మహిళా మావోయిస్టు రానాగా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm