న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా అంశంపై ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ కాంగ్రెస్ నేతలు కమల్నాథ్, సచిన్ పైలట్ వేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నకిలీ ఓటర్ల నమోదు ఆరోపణలున్నందున్న ఓటర్ల జాబితా పీడీఎఫ్ కాపీలు ఇచ్చేలా ఈసీని ఆదేశించాలని పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఎక్కడైనా లోపాలు తలెత్తితే తాము సవరిస్తామంటూ ఈసీ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తూ, కాంగ్రెస్ నేతల పిటిషన్లను కొట్టివేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Mon Jan 19, 2015 06:51 pm