న్యూఢిల్లీ : పన్నుల ఎగవేతకు సంబంధించిన కేసులో ప్రముఖ మీడియా అధిపతి రాఘవ్ బాల్ నివాసాలపై, ఆయన న్యూస్ పోర్టల్ 'ది క్వింట్' కార్యాలయంపై గురువారం ఆదాయపన్ను అధికారులు దాడులు జరి పారు. నోయి డాలోని బాల్ నివాసంపై ఐటీ అధికారుల బృందం దాడి జరిపిందని, ఈ కే సుకు సంబంధించిన పత్రా లు, ఇతర సాక్ష్యాధా రాల కోసం గాలించిందని అధికారులు తెలిపారు. పన్నుల ఎగవేత ఆరోపణలపై కొంతమంది వ్యాపార ప్రముఖులపై ఐటీ శాఖ జరుపుతున్న దాడుల్లో భాగంగా మరికొంతమంది నివాసాలపై దాడులు, సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. క్వింట్ న్యూస్ పోర్టల్కు, నెట్వర్క్ 18 గ్రూప్కు బాల్ వ్యవస్థాపకుడు. కాగా, ఈ దాడులపై స్పందిస్తూ బాల్, ఎడిటర్స్ గిల్డ్ను ఉద్దేశిస్తూ ఒక ప్రకటన చేశారు. ఈ ఉదయం తాను ముంబయిలో వుండగా, డజన్ల సంఖ్యలో ఐటీ అధికారులు తన ఇంటిపై, క్వింట్ కార్యాలయంపై దాడులు చేశారని, ఇది తనకెంతో ఆందోళన కలిగించిందని చెప్పారు. తమది పూర్తిగా పన్నులు చెల్లిస్తున్న సంస్థ అని, అవసరమైన ఆర్థిక పత్రాలన్నింటినీ అందచేయగలమని చెప్పారు. ఇంట్లో వున్న ఐటీ అధికారులతో తాను ఫోన్లో మాట్లాడానని, ఏ మెయిల్ను లేదా డాక్యుమెంట్ను తీసి చూడొద్దని, అందులో అత్యంత సున్నితమైన జర్నలిస్టు సమాచారం వుండొచ్చునని చెప్పానని తెలిపారు. ఒకవేళ అలా చేసినట్లైతే తీవ్రమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ విషయంలో ఎడిటర్స్ గిల్డ్ తమకు పూర్తి మద్దతును ఇవ్వగలదని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ పత్రాలకు సంబంధించి అనధికార కాపీలను తీసుకునేందుకు స్మార్ట్ఫోన్లను కూడా దుర్వినియోగం చేయరాదని కోరారు. తన భార్యను, తల్లిని ఇంటికే పరిమితం చేశారని, ఎవరితో మాట్లాడనివ్వడం లేదని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాకు తన స్టేట్మెంట్ను విడుదల చేశారు. నిజాయితీపరుడైన బాల్నివాసాలపై దాడి జరగటంపై మోడీ సర్కార్ మీడియాపట్ల ఏవిధంగా వ్యవహరి స్తున్నదో అర్థమవుతున్నదని కేంద్రమాజీ మంత్రి అరుణ్శౌరి అన్నారు.
సోషల్ మీడియాలో ఆందోళనలు
సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభు త్వాన్ని విమర్శించే మీడియాను అడ్డగించడమే ఈ దాడుల ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఇటీవలే ఆప్ నుంచి బయటకు వచ్చిన జర్నలిస్ట్ అశుతోష్ స్పందిస్తూ, మోడీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బాల్ మూల్యం చెల్లిస్తున్నారని వ్యాఖ్యానించారు.