హైదరాబాద్ : రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో విండీస్ మూడవ వికెట్ కోల్పోయింది. 68 బంతులు ఆడిన విండీస్ ఆటగాడు షాయ్ హోప్ 36 పరుగుల చేసి వెనుదిరిగాడు. భారత బౌలర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్లో షాయ్ హోప్ జట్టు స్కోరు 86 వద్ద ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. విండీస్ 31.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm