నెల్లూరు: మోడీ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపించేలా ఉందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేకులపై కక్ష సాధిస్తూ జైళ్లకు పంపుతున్నారన్నారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంపై పోరాడుతున్న ఎంపీ సీఎం రమేష్పై ఐటీని ఉసిగొల్పారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి పీఎంవోలో తిష్టవేసి పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm