ధర్మాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ న్యాయస్థానంలో ఊరట లభించింది. తనపై జారీచేసిన బెయిలుకు వీలులేని వారెంట్(నాన్బెయిలబుల్ వారెంట్) వెనక్కి తీసుకోవాలని(రీకాల్) అభ్యర్థిస్తూ చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు రెండ్రోజుల క్రితం ధర్మాబాద్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, మరో న్యాయవాది సుబ్బారావు వాదనలు వినిపించారు.
Mon Jan 19, 2015 06:51 pm