న్యూఢిల్లీ: లైంగిక వేధింపులపై చేపట్టిన 'మీటూ' ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా క్రీడా రంగానికి కూడా ఆ సెగ తగిలింది. శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగపై భారత ఎయిర్ హోస్టెస్ లైంగిక ఆరోపణలు చేసిన తర్వాతి రోజే ఆ దేశ పేసర్ లసిత్ మలింగపై అదే తరహా ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. 'మీటూ'కు మద్దతుగా క్రికెటర్ వేధింపులకు గురైన అజ్ఞాత మహిళ ఆవేదనను ప్లేబ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేసింది. 'కొన్నేళ్ల క్రితం ముంబైలోని హోటల్లో స్నేహితురాలి కోసం వెతుకుతున్న నాకు ఎదురైన చేదు అనుభవం. అది ఐపీఎల్ సీజన్. క్రికెటర్లు ఉన్న హోటల్లోనే మేమూ బస చేశాం. ఫ్రెండ్ కోసం చూస్తుండగా క్రికెటర్ లసిత్ మలింగ తారసపడ్డాడు. ఆమె తన రూమ్లోనే ఉందని చెప్పాడు. లోపలికి వెళ్లగా ఎవరూ కనిపించలేదు. వెనుకనే వచ్చిన క్రికెటర్ నన్ను మంచంపైకి తోసి అసభ్యంగా ప్రవర్తించాడు. అతడితో పోరాడలేక కళ్లు మూసుకున్నా. నా ముఖాన్ని అతడు వాడుకున్నాడు. ఇంతలోనే హోటల్ సిబ్బంది బెల్ కొట్టడంతో తలుపు తీయడానికి వెళ్లాడు. ఇదే అదనుగా నేను బాత్రూమ్లోకి వెళ్లి ముఖం శుభ్రం చేసుకున్నా. హోటల్ సిబ్బంది వెళ్లిన తర్వాత బయటపడ్డా. ఎవరికైనా చెబితే అతడు ప్రముఖ క్రికెటర్.. నువ్వే కోరి వెళ్లి ఉంటావని నన్ను త ప్పుబడతారు' అని సదరు మహిళ మౌన రోదనను చిన్మయి ట్వి టర్లో పోస్టు చేసింది. తమిళ సినీకవి వైరముత్తుపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm