తిరువనంతపురం: కేరళ సరిహద్దులోని మైసూర్ - మనంతవాడీ రహదారిపై బస్సు ఢీకొనడంతో 48 ఏళ్ల ఏనుగు(రౌడీ రంగ) మృతి చెందింది. నాగర్హోల్ జాతీయ పార్కుకు చెందిన ఏనుగు రహదారిపై నడుచుకుంటూ వెళ్తుంది. ఈ సమయంలో కర్ణాటక నుంచి కేరళకు వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు ఏనుగును ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఏనుగు చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రయివేటు బస్సు డ్రైవర్పై అటవీ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm