హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2016, నవంబర్ 11, 13 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్-2 రాతపరీక్షల్లో సరిగా బబ్లింగ్ చేయని, వైట్నర్ ఉపయోగించిన వారిని మౌఖిక పరీక్షలకు(ఇంటర్వ్యూలకు) అనుమతించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో ఇవాళ హైకోర్టు తీర్పునిచ్చింది. డబుల్ బబ్లింగ్ ఉన్న సమాధాన పత్రాలు తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన వారిలో డబుల్ బబ్లింగ్ చేసిన వారిని తొలగించి.. 1:2 పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆదేశించింది. గ్రూప్ 2లో 3147 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసిన 267 మందిని హైకోర్టు తొలగించింది. 2016, సెప్టెంబర్లో 1,032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm