వరంగల్ అర్బన్: సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతున్న ఎనిమిది మంది నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ లో చోటుచేసుకుంది. సీసీ కెమెరాల ద్వారా వీరిని గుర్తించి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 12 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రైల్వే పోలీస్ ఎస్పీ జి అశోక్ కుమార్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm