హైదరాబాద్: సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపుపై సమావేశంలో చర్చించామని, ఇప్పటికే రౌడీషీటర్లను బైండోవర్ చేశామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఈసీ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని శిక్షణ ఇచ్చామని తెలిపారు. హైదరాబాద్ లో పోలీస్ ఉన్నతాధికారులతో ఈసీ నిర్వహించిన సమావేశం ముగిసింది. వీవీ పాట్స్, సీ విజిల్స్, సువిధ యాప్ పై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపుపై చర్చించామన్నారు. లైసెన్స్ తుపాకులను డిపాజిట్ చేయాలని సూచించామన్నారు. మూడేళ్లు సర్వీస్ పూర్తయిన వారిని బదిలీ చేయాలని ఈసీ సూచించిందన్నారు. 17వతేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. పక్క రాష్ట్రాల పోలీసులతోనూ సమన్వయం చేసుకుంటామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm