న్యూఢిల్లి: ప్రధాని నరేంద్ర మోడీ మీటూపై స్పందించాలని బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ తమను లైంగికంగా వేధించాడంటూ పలువురు మహిళా జర్నలిస్టులు చేసిన ఆరోపణలపై సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ఆలస్యంగానైనా వారు ముందుకు వచ్చారని ఆయన చెప్పారు. మీటూ ఉద్యమానికి తాను ఇప్పటికే మద్దతు పలికానని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోడీ దీనిపై స్పందించాలని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm