హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ గురించి టీ-కాంగ్రెస్ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంటే చంద్రబాబుదేమీ కాదని, అది తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ అని అన్నారు. కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై మాట్లాడే అర్హత సీఎం కేసీఆర్ కు లేదని, చంద్రబాబు పేరిట ప్రజలను రెచ్చగొట్టాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్-టీడీపీ కలయికతో కేసీఆర్ కు భయం పట్టుకుందని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఇచ్చిన వాగ్దానాలపై సమాధానం చెప్పలేకనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. ఈ సందర్భంగా జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభిమానులు తనను సీఎంగా చూడాలనుకోవడంలో ఎటువంటి తప్పులేదని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm