విజయవాడ: ఏపీలో టీడీపీ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి పరిటాల సునీత కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నగరంలో స్వరాజ్య మైదానంలో డ్వాక్రా బజార్ను మంత్రి సునిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ నేతల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. మోడీ, అమిత్ షా టీడీపీపై కుట్రతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఐటీ దాడుల వల్ల పెట్టుబడిదారులు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. మహిళలు సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయన్నారు. ఒక్క రోజులోనే రూ.20 లక్షల వ్యాపారం జరిగిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm