న్యూఢిల్లీ : సహచర మహిళా పాత్రికేయులను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) డిమాండ్ చేసింది. గతంలో ఃఏసియన్ ఏజ్ః పత్రిక ప్రధాన సంపాదకుడిగా పనిచేసిన ఎంజె అక్బర్ తనతో కలిసి పనిచేస్తున్న పాత్రికేయురాలు ఘజాలా వాహబ్పై కొనసాగించిన లైంగిక వేధింపుల వార్తలు మరుగున పడక ముందే మరో ఆరుగురు మహిళా పాత్రికేయులు అక్బర్ లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేశారని ఐద్వా తన ప్రకటనలో పేర్కొంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఘజాలా, ఇతర మహిళా పాత్రికేయులకు ఐద్వా పూర్తి మద్దతునిస్తోందని తెలిపింది. లైంగిక వేధింపులను ఎదుర్కొన్న ఈ మహిళా పాత్రికేయుల అనుభవాలు వెలుగు చూసిన తరువాత కూడా ఈ విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పాటిస్తున్న మౌనం తమను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోందని ఐద్వా తెలిపింది. మహిళా పాత్రికేయుల నుండి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై తక్షణమే ప్రభుత్వం నిష్పాక్షిక దర్యాప్తు జరిపించి సూత్రధారులను చట్టానికి అప్పగించాలని ఐద్వా డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగాను, ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఐద్వా తన కమిటీలకు పిలుపునిచ్చింది. శుక్రవారం నాడు జంతర్ మంతర్లో తాము భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామని, మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలు, శక్తులు ఈ ప్రదర్శనలో పాల్గొనాలని కోరుతున్నామని ఐద్వా తెలిపింది.
వెంటనే పదవినుంచి వైదొలగాలి..! : సీపీఐ(ఎం)
గతంలో వివిధ పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించిన కేంద్ర మంత్రి ఎంజె అక్బర్నుండి లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తనను ఎదుర్కొన్న ఏడుగురు మహిళా పాత్రికేయులు చేసిన ఫిర్యాదులను పరిశీలించి ప్రభుత్వం ఆయన్ను మంత్రి పదవినుంచి తొలగించాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో డిమాండ్ చేసింది. అత్యంత తీవ్రమైన ఆరోపణలతో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆయన్ను మంత్రి పదవిలో కొనసాగిం చటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పొలిట్బ్యూరో ఒక ప్రకటనలో పేర్కొంది. అక్బర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 12,2018 05:49PM