కడప: టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నివాసంలో ఉదయం నుండి జరుగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. తిరుపతి, ప్రొద్దుటూరుకు చెందిన 12 మంది అధికారులు మొత్తం పదిగంటల పాటు ఈ సోదాలు నిర్వహించారు. సీఎం రమేష్ సోదరుడు సురేష్ సమక్షంలో జరిగిన ఈ సోదాలలో ఆస్తులకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ దాఖలు మీద విచారించారు. బ్యాంకులలో నిల్వ ఉన్న నగదు, ఆస్తులు, అప్పులు, భూములు తదితర అంశాల మీద సురేష్ నుండి ఆరాలు తీశారు. పదిగంటల పాటు సోదాలు చేసినా ఎక్కడా అవకతవకల ఆధారాలు దొరకలేదని.. ఐటీ అధికారులు ఎలాంటి పత్రాలు స్వాధీనం చేసుకోలేదని.. తాము నిజాయితీగానే వ్యాపారాలు చేసుకుంటున్నామని సురేష్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm