జగిత్యాల: జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి బొడిగె శోభకు ప్రచారంలో రెండోసారి నిరసన సెగ తగిలింది. ఈ నెల 9న ప్రచారానికి వెళితే కొలిమికుంట గ్రామస్థులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె చేసేదేమీలేక అక్కడి నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. నేడు కూడా అదే పరిస్థితి శోభకు ఎదురైంది.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాలలో ఆమె ప్రచారానికి వెళ్లగా.. తమ గ్రామానికి రావొద్దంటూ ఆమెను గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులూ చేయలేదని వారు ఆందోళనకు దిగారు. గ్రామంలో టీఆర్ఎస్లోని రెండు వర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 12,2018 09:06PM