వరంగల్: వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. ఎనుమాములతో పాటు కమలాపూర్, ఎల్కతుర్తిలో మరో రెండు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాణ్యమైన మొక్కజొన్నలను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి ప్రభుత్వం అందిస్తున్న 700 రూపాయలు మద్దతు ధర పొందాలని మార్క్ ఫెడ్ మేనేజర్ రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలు నవంబర్ చివరి వరకు కొనుగోలు నడుస్తాయన్నారు. రైతులు తొందరపడి మొక్కజొన్నలను మార్కెట్ యార్డుకు తరలించి ఇబ్బందులు పడొద్దని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm