హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో సోమవారం విద్యుదాఘాతానికి గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. బొద్దుగొండలో విజయ్(25), మట్టేవాడ శివారు పర్కాలతండాలో బానోత్ భీమ్సాగర్(21) మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. కాగా, అప్పులబాధతో సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం బస్వాపూర్లో మల్లేశం(38) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm