హైదరాబాద్ : చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 4న హైదరాబాద్ సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ బహిరంగ సభకు రెండు తెలుగు రాష్ర్టాల సీఎంలతో పాటు ఇతర రాష్ర్టాల సీఎంలు, కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి 200 తీర్మాణాలు ఆమోదించారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తమ వైఖరి మార్చుకొని 50 శాతం సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm