హైదరాబాద్ : ఎన్నికల ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు స్థానికుల నుంచి నిలదీతలు, చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. సోమవారం గాదరి కిషోర్కుమార్ యాదాద్రి జిల్లా మోత్కూరులోని అన్నెపువాడకు వెళ్తుండగా, కొందరు యువకులు ఆయనను అడ్డుకున్నారు. నాలుగేళ్లుగా ఏం చేశారని, ఇప్పుడు ఓట్లకోసం ఎలా వస్తారంటూ నిలదీశారు. మరోవైపు.. మహబూబాబాద్ శివారు బేతోలులో బానోత్ శంకర్ నాయక్ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ములుగు నియోజకవర్గంలో మంత్రి చందూలాల్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న అసమ్మతివర్గం నేతల జీపును సుమారు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని దాడి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm