హైదరాబాద్ : రైల్వేస్టేషన్లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి న్యాయస్థానం 12 రోజుల జైలు శిక్ష, రూ.250 జరిమానా విధించింది. ఈ నెల 19న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో షీటీమ్స్ నిఘా ఏర్పాటు చేయగా, విజయనగరం జిల్లాకు చెందిన తిరుపతి(48) మహిళా ప్రయాణికుల వెనుక ఉంటూ వారిని అసభ్యకరంగా తగులుతూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వెంటనే అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం జైలుశిక్ష విధించిందని నగర అదనపు పోలీసు కమిషనర్(క్రైమ్స్) షిఖాగోయెల్ తెలిపారు
Mon Jan 19, 2015 06:51 pm