న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పటాకుల తయారీ, అమ్మకాలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పును వెలువరించనుంది. పటాకులను కాల్చడం ద్వారా వాయుకాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందంటూ గతంలో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్భూషణ్ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపి ఆగస్టు 28న తీర్పును రిజర్వు చేసింది. రాజ్యాంగం అందించిన జీవించే హక్కు ఇరువురికి వర్తిస్తుందని, పటాకులపై నిషేధం విధించే విషయంలో ఈ రెండు అంశాలను సమంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది
Mon Jan 19, 2015 06:51 pm