గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వ్యానును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితులు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసులుగా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm