హైదరాబాద్: సోమవారం గచ్చిబౌలి డీఎల్ఎఫ్ సమీపంలోని కృతుంగ రెస్టారెంట్లో.. చికెన్ఫ్రైడ్ రైస్లో చనిపోయిన ఈగలు ప్రత్యక్షమయ్యాయి. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన శివకృష్ణకు సోమవారం మధ్యాహ్నం ఈ అనుభవం ఎదురైంది. చిత్రమేమిటంటే.. తొలుత ఆ వంటకంలో చనిపోయిన ఈగ కనిపించడంతో అతను రెస్టారెంట్ నిర్వహకులకు ఫిర్యాదు చేశారు. వారు మరోసారి అందించిన వంటకంలో కూడా చనిపోయిన ఈగ ఉంది. దీనిపై నిర్వాహకులను నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ ఏఎంహెచ్వో బిందుభార్గవికి ఫిర్యాదుచేశామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm