హైదరాబాద్ : పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా రూ.20 కోట్లు గుంజేందుకు ప్రయత్నించిన ముగ్గురు పేటీఎం ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. శర్మ వ్యక్తిగత డేటాను, అత్యంత రహస్యమైన వివరాలను దొంగిలించిన ఉద్యోగులు వాటిని బయటపెడతామని బాస్నే బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే తక్షణం రూ.20 కోట్లు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో శర్మ సెక్రటరీ కూడా ఉన్నాడు. ఈ మొత్తం పథకానికి అతడే సూత్రధారి అని పోలీసులు తెలిపారు. తాము డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకుంటే దొంగించిన వివరాలను బయటపెడతామని, వాటిని దుర్వినియోగం చేస్తామని బెదిరించారు. దానివల్ల సంస్థ పరువు పోయి బజారున పడాల్సి వస్తుందని బాస్ను హెచ్చరించారు. ఈ కేసులో నాలుగో నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm