హైదరాబాద్: ఎన్నికల వేళ పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. నగదు తరలింపునకు సంబంధించిన పత్రాలు, రసీదులు లేకపోతే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా గత రాత్రి మూడు చోట్ల నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా రూ.74.82లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయినాథ్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఎంజే వంతెన వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న రూ.60 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన డబ్బు వ్యాపారం కోసం తీసుకువెళ్తున్నామని కారులో ప్రయాణిస్తున్న వారు చెబుతున్నా అందుకు తగ్గ ఆధారాలు చూపలేకపోయారని ఏసీపీ నరేందర్రెడ్డి చెప్పారు. ఈ సొమ్మును ఐటీ అధికారులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. అలాగే జూబ్లీహిల్స్లో రామచంద్రరావు అనే వ్యక్తి దగ్గర రూ.4.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోచోట బ్రిటిష్ తివారి అనే వ్యక్తి వద్ద రూ.9.97లక్షల నగదు పట్టుబడింది.
Mon Jan 19, 2015 06:51 pm