ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంగళవారం ఆరు గంటలపాటు మూసివేయనున్నారు. ప్రధాన, సెకండరీ రన్వేల మరమ్మతుల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. దీనివల్ల వందలాది మంది ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యే అవకాశముంది. అక్టోబరు, ఫిబ్రవరి-మార్చి నెలల్లో రెండు విడతలుగా ఈ రన్వే మరమ్మతులు చేపట్టనున్నట్లు విమానాశ్రయ అధికారులు ముందుగానే ప్రకటించారు. దీనివల్ల రోజుకు 300 విమానాల రాకపోకలపై ప్రభావం పడనుంది. ముంబయి విమానాశ్రయంలో మరమ్మతుల కారణంగా రీ షెడ్యూల్, రద్దు చేసిన విమాన సర్వీసుల వివరాలకు తమ వెబ్సైట్ సందర్శించాలని ఎయిర్ ఇండియా సంస్థ సోమవారం ట్వీట్ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm