చేర్యాల: సిద్దిపేట జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. చేర్యాల పోలీస్స్టేషన్ పరిధిలోని గురుజకుంట చెక్పోస్టు దగ్గర హైదరాబాద్కు చెందిన తిరుపతిరెడ్డి కారులో రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో రూ.10.95 లక్షలు పట్టుబడ్డాయి.
Mon Jan 19, 2015 06:51 pm