ముంబై: తమకు రోజుకు మూడువేల రూపాయల ఆదాయం ఇవ్వాలని డిమాండు చేస్తూ ముంబై నగరంలోని ఒలా, ఉబర్ సర్వీసుల డ్రైవర్లు మంగళవారం కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. దీంతో ముంబై నగరంలో ఒలా, ఉబర్ సర్వీసుల సేవలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లు నెరేవేరే దాకా తాము సమ్మె చేస్తామని క్యాబ్ డ్రైవర్లు చెప్పారు. కాగా కొంతమంది డ్రైవర్ల సమ్మె వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో సర్వీసులను పునరుద్ధరిస్తామని ఉబర్ అధికార ప్రతినిధి చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm