శంషాబాద్: మండల పరిధిలోని ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్టులో బుధవారం జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ట్రస్టు యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా ట్రస్టు నిర్వాహకులు మాట్లాడుతూ.. స్వర్ణభారత్ ట్రస్టు, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అధ్వర్యంలో నేడు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియేట్లో ఎంపీసీ, బైపీసీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు మేళాను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు ఫార్మా రంగంలో ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంతో ఎస్ఎ్సఎస్డీసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శిక్షణలో భోజన వసతితో పాటు ట్రైనింగ్కు కావాల్సిన వస్తువులు ఉచితంగా ఇవ్వనన్నట్లు వారు తెలిపారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులను బీఎస్సీ చదివిస్తామని తెలిపారు. వయస్సు 18 - 21 సంవత్సరాలు ఉండాలని 2016-17, 2018 ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే ఉద్యోగ మేళాలో పాల్గొన్నాలని పేర్కొన్నారు. అభ్యర్థులు వారి వెంట అధార్ కార్డు జిరాక్స్లు, ఒరిజినల్ సర్టిఫికేట్లు, పాస్పోర్టు సైజ్ ఫోటోలు నాలుగు వెంట తీసుకుని రావాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ సెల్: 80085566331, 040-23471కు సంప్రదించాలని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm