ఢిల్లీ: బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఇండియాలో ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లల సెంటిమెంట్ తో ముడిపడిన దీపావళి, బాణసంచా అమ్మకాలను పూర్తిగా నిషేధించే ఉద్దేశం తమకు లేదని సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం తెలిపింది. పటాసుల అమ్మకాలపై నిషేధం విధించలేమని, అయితే విక్రయాలపై కొన్ని షరతులు వర్తిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది. ఇక దీపావళి పండగ రోజున కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు పేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాణసంచా తయారీ పరిశ్రమలపై ఆధారపడి దాదాపు 5 వేల కుటుంబాలు బతుకుతున్నాయని, వీరికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపకుండా అమ్మకాలను నిషేధించలేమని పేర్కొంది. అయితే ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా బాణసంచా విక్రయాలపై కోర్టు నిషేధం విధించింది.
ఫ్లిప్కార్ట్, అమేజాన్ లాంటి ఈ-కామర్స్ పోర్టళ్లు, ఆన్లైన్ ద్వారా బాణసంచా విక్రయాలపై న్యాయస్థానం నిషేధం విధించింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి విక్రయాలు జరిపితే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ తీర్పు కేవలం దీపావళి పండగకు మాత్రమే కాదని, అన్ని మతాల పండగలు, శుభకార్యాలకు వర్తిస్తుందని సుప్పీంకోర్టు తెలిపింది. దీపావళి నాడు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతినిచ్చింది. ఇక క్రిస్మస్, నూతన సంవత్సరం నాడు అర్ధరాత్రి 11.55 నుంచి 12.30 గంటల మధ్య బాణసంచా కాల్చాలని స్పష్టం చేసింది. కమ్యూనిటీగా బాణసంచా పేల్చడాన్ని కేంద్రం ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోర్టు సూచించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 23,2018 12:36PM