హైదరాబాద్: దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతున్నా పోలింగ్ శాతంలో మహిళలు ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. దీనిపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం 'పింక్ పోలింగ్ బూత్' పేరుతో మహిళా ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.గుజరాత్,గోవా, హిమాచల్ ప్రదేశ్ లో ఈ విధానం విజయవంతం కావడంతో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో తొలిసారిగా వీటిని ఏర్పాటు చేస్తుండగా వీటిలో పూర్తిగా మహిళలే విధులు నిర్వహిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm