న్యూఢిల్లీ: ప్రధాని మోడీ పై ప్రముఖ రచయిత్రి, కాలమిస్టు శోభాడే ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పడి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా జరిగిన సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆజాద్ హింద్ ఫౌజ్ టోపీ ధరించడంపై ప్రముఖ రచయిత్రి శోభాడే ట్విట్టర్ లో చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. "సుభాష్ చంద్రబోస్ ధరించిన ఆజాద్ హింద్ ఫౌజ్ టోపి ధరించినంత మాత్రాన మీరు నేతాజీ కాలేరు" అంటూ శోభాడే ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై మోడీ మద్ధతుదారులు రచయిత్రిపై విమర్శల వర్షం కురిపించారు.
Mon Jan 19, 2015 06:51 pm