జమ్మూకశ్మీర్: పూంచ్ సెక్టార్లోని ఆర్మీ క్యాంప్లో పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన సమయంలో ఆర్మీ క్యాంప్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఇవాళ ఉదయం 10.45 గంటల సమయంలో మోతిమహల్లోని 93వ బ్రిగేడ్ ప్రధానకార్యాలయం వద్ద ఉన్న క్యాంప్లోని పేలుడు సంభవించిందని ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. ఈ ఘటనకు సరిహద్దు పేలుళ్లతో సంబంధం లేదని, దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm