యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట సమీపంలోని సురేంద్రపురి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను.. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని సంగీత(60)గా పోలీసులు గుర్తించారు. గత 10 నెలల నుంచి సురేంద్రపురిలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో వంటమనిషిగా పని చేస్తున్నారు. మహిళను ఢీకొట్టిన బస్సు పికెట్ డిపోకు చెందింది. ఆర్టీసీ బస్సు నెంబర్ టీఎస్ 07 యూఈ 5951.
Mon Jan 19, 2015 06:51 pm