విజయవాడ: సీబీఐ అధికారుల అవినీతిపై దర్యాప్తు సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సీబీఐని దిగజార్చిన ఘనత మోడీకే దక్కుతుందని రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాఫెల్ స్కాం, సీబీఐ అవినీతి, ఇతర అంశాలపై రేపు జిల్లాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అగ్రిగోల్డ్పై టీడీపీ, బీజేపీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. నవంబర్ 1, 2 తేదీల్లో అగ్రిగోల్డ్ బాధితులు దీక్షలు చేయనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm