చైనా: బొగ్గుగని ప్రమాదంలో చిక్కుకునిపోయిన కార్మికులను రక్షించేందుకు చైనా అత్యవసర సహాయక బృందం సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. షాండాంగ్ ప్రావిన్స్లోని షాప్ట్లోపల రాళ్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 300 మంది కార్మికులు అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నారు. అయితే రెస్క్యూ టీం అప్రమత్తమై అందరినీ కాపాడగా..18 మంది అందులో ఉండిపోయారు. 18 మందిని సురక్షితంగా కాపాడేందుకు రెస్యూ టీం ఘటనాస్థలం వద్ద అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. అత్యవసర ఆక్సిజన్ ట్యాంక్లను అండర్గ్రౌండ్లోకి పంపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బొగ్గుగనులు చైనాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం కూడా అత్యాధునిక పరికరాలతో, టెక్నాలజీ సాయంతో భద్రతా నియమనిబంధనలను పాటిస్తూ ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటోంది.
Mon Jan 19, 2015 06:51 pm